* ఉత్తర్వులుజారీచేసినఆర్థికశాఖ
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్త పోస్టుల సృష్టి, ఉన్నవాటి పెంపు, తగ్గింపు, హోదాల్లో మార్పులకు సంబంధించిన ప్రక్రియను సరళీకృతం చేస్తూ ఆర్థికశాఖ డిసెంబరు 23న ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకాలం ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి 9 దశల్లో దస్త్రాలు వివిధ శాఖల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇకనుంచి ఈ దశలను ఆరుకు తగ్గిస్తూ మార్పులు చేశారు. దీనివల్ల ప్రక్రియను పూర్తిచేయడానికి సమయం తగ్గుతుందని, దస్త్రాలను త్వరగా పరిష్కరించవచ్చని ఆర్థికశాఖ తెలిపింది.