ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు సైకిళ్లు –
* ఏపీ ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే బాలికలకు సైకిళ్లు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన దస్త్రం ఇప్పటికే సిద్ధమైంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. మొత్తం 7.41 లక్షల సైకిళ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు సైకిళ్లు –
02
Oct