RSS

విద్యా హక్కు అమలుకు సలహా మండలి ఏర్పాటు

25 Feb

ఈనాడు-హైదరాబాద్:వి ద్యా హక్కు చట్టం అమలుతీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలిచ్చేందుకు 31 మందితో సలహా మండలిని ఏర్పాటుచేస్తూ ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఫిబ్రవరి 24న ఉత్తర్వులు జారీచేశారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఛైర్‌పర్సన్‌గా..మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఇఫ్లూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎన్జీఓ తరపున సభ్యులుగా 12 మందికి అవకాశం కల్పించారు.

 
Comments Off on విద్యా హక్కు అమలుకు సలహా మండలి ఏర్పాటు

Posted by on February 25, 2014 in Uncategorized

 

Comments are closed.