* సూపర్ 30 ఆనంద్కుమార్వ్యాఖ్య
జంషెడ్పూర్: దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ ఒకరకంగా ధనవంతులే లక్ష్యంగా ఉందని పాట్నాలోని సూపర్ 30 (ఐఐటీ శిక్షణ సంస్థ) వ్యవస్థాపకుడు ఆనంద్కుమార్ నవంబరు 17న అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జేఈఈ పరీక్షల నిర్వహణ తీరు సరికాదని అది విద్యార్థుల సహజసిద్ధమైన మేధస్సు, సృజనాత్మకతను కొలిచేదిగా ఉండాలని సూచించారు. ఐఐటీల్లో ప్రవేశ పరీక్షలు రాసే అర్హత రెండు సార్లకన్నా ఎక్కువగా ఉండాలన్నారు. ప్రస్తుత పరీక్షల వ్యవస్థ అంతర్జాలంలేని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కష్టతరంగా మారిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా విద్యా వ్యవస్థను మార్చాలని కోరారు. సూపర్ 30ని కేవలం 30 మందికే పరిమితం చేయకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చేలా మార్చుతున్నామని వివరించారు.